ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచిన పాకిస్తాన్

international |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 09:04 PM

ప్రతి సారి పాకిస్తాన్ తన వక్రబుద్దిని ప్రదర్శిస్తూనే ఉంది. పాకిస్థాన్ కుటిల బుద్ధి మరోసారి బయటపడింది. జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు పొడవునా తూటాల మోత మోగించింది. పాక్ రేంజర్లు ఎలాంటి కవ్వింపులు లేకుండానే భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లపై కాల్పులు జరిపారు. 


ఇవాళ ఉదయం జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్ లో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ దీటుగా జవాబిచ్చిందని బీఎస్ఎఫ్ డిప్యూటీ ఐజీ ఎస్పీఎస్ సంధు వెల్లడించారు. బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పాక్ దళాలు తుపాకీలకు పనిచెప్పాయని వివరించారు. అయితే, భారత్ వైపున ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని బీఎస్ఎఫ్ జమ్మూ ప్రాంత పీఆర్వో వెల్లడించారు. గతంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ గతేడాది ఫిబ్రవరిలో భారత్, పాక్ ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే పాక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పరిపాటిగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa