ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమజ్జన ప్రక్రియలో జరిగిన అపశృతి, ఇద్దరు మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 03:23 PM

వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియలో ది: 11.09.2022వ తేది నాడు కాకినాడ జిల్లా పరిధిలోని  నవఖండ్రవాడ గ్రామం, పిఠాపురం మండల గోదావరి కాలువలో  ప్రమాదవ శాత్తు పడి నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయి గల్లంతైన 1)కుమారస్వామి   2) నరసింహాచారి  ల మృతదేహాలను గుర్తించడానికి జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS ఆదేశాల మేరకు సంఘటన జరిగిన రాత్రి నుండి కాకినాడ 3వ APSP బెటాలియన్ SDRF  వారు స్థానిక పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత గాలింపు చర్యలు చేపట్టి వారిరువురి మృతదేహాలను గుర్తించడం జరిగింది.


సంఘట జరిగిన వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి అతి తక్కువ సమయంలో మృతదేహాలను గుర్తించి బాధిత కుటుంబాలకు అందించడంలో కృషి చేసిన కాకినాడ 3వ APSP బెటాలియన్ SDRF  బృందం ఇన్చార్జ్ RSI రవి మరియు  సిబ్బందిని SP అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa