గుంతకల్లు పట్టణంలోని 35వ వార్డు పోర్టర్ లైన్లో పారిశుద్ధ్య కార్మికులు మూడు బుట్టల విధానంలో నిర్వహి స్తున్న ఇంటింటా చెత్త సేకరణ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి, ప్రమాదకర చెత్తలను మున్సిపాలిటీ అందించిన మూడు బుట్టలలో ఇవ్వాలని ఆ వార్డులోని మహిళలకు కమీషనర్ సూచిం చారు. తమ ఇళ్లతో పాటు పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా స్వచ్ఛ గుంతకల్లు కు ప్రజలు సహకరించాలని కోరారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సచివాలయ కార్యదర్శి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa