అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్నమయ్య డ్యామ్ లస్కర్ రామయ్యకు పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. విచక్షణారహితంగా ఇసుక తవ్వకాల వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. బాధ్యతారాహిత్యం వల్లే డ్యామ్ కొట్టుకుపోయిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. లస్కర్ రామయ్య లేకుంటే మరిన్ని ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. విపత్తు నిర్వహణ సంస్థ చేయాల్సిన పనులను రామయ్య చేశారని కొనియాడారు. రామయ్య దాదాపు 200 మంది ప్రాణాలను కాపాడాడని అన్నారు. వంశీకృష్ణకు రూ.50 వేల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa