ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 8న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 09:51 PM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించింది. వచ్చే నెల 8న ప్రిలిమినరీ రాత పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 నుంచి 12 వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు రెండో పేపర్ పై పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే! ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నవంబర్ 5 తోనే పూర్తయింది. వచ్చే నెల 8న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.


ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 31 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa