వంద కోట్ల రూపాయలకు జనసేన పార్టీని టిడిపికి తాకట్టు పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై.. ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రూ.1500 కోట్లకు కాంగ్రెస్కు అమ్మేశారని.. ఇప్పుడు పవన్ కల్యాణ్ రూ.1000 కోట్లకు జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టారని కేఏ పాల్ ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ ఈ డీల్ను సెట్ చేశారని వివరించారు. దీన్ని గమనించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ పవన్కు దూరమయ్యారని వ్యాఖ్యానించారు. కాపు సామాజికవర్గం పేరు చెప్పి.. అప్పుడు ప్రజారాజ్యాన్ని.. ఇప్పడు జనసేన ను అమ్మేస్తోన్నారని కేఏ పాల్ ఫైర్ అయ్యారు.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. పవన్ కల్యాణ్ యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారని.. అప్పట్లో చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా భావించారని కేఏ పాల్ గుర్తు చేశారు. నారా లోకేష్ను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని చేయడానికి నాదెండ్ల మనోహర్-చంద్రబాబు ప్లాన్ చేశారని.. అందుకు రూ.1000 కోట్లు పవన్కు ఇప్పస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్కు సంక్రాంతి కానుక అందిందని సెటైర్లు వేశారు. కేఏ పాల్ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
ఇటు.. చంద్రబాబు-పవన్ భేటీలో సీట్ల పంపకం కూడా చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి 22 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఏంపీ స్థానాలు కేటాయించవచ్చు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంట్లో ఎక్కువగా విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. జనసేన 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు అడిగినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రతిపాదనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa