కర్నూలు మార్కెట్ యార్డుకు 512 క్వింటాళ్ల ఎండుమిర్చిని రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. బేటా రకం ఎండుమిర్చికి క్వింటానికి గరిష్ఠంగా రూ.45,209 ధర పలికింది. ఈ ధర గుంటూరు మార్కెట్ యార్డులో కూడా ఎప్పుడూ లేదని సెలక్షన గ్రేడ్ సెక్రటరీ గోవిందు, అసిస్టెంట్ సెక్రటరీలు వెంకటేష్, రెహిమానలు తెలిపారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఎండుమిర్చికి మంగళవారం మధ్యస్థ ధర రూ.17,888, కనిష్ట ధర రూ.7,699 ధర లభించిందని వారు తెలిపారు. వేరుశనగ కాయలకు గరిష్ఠ ధర రూ.8,035, మధ్యస్థ ధర రూ.7,119, కనిష్ఠ ధర రూ.5,112 దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa