ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు లో విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 08:22 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి  వేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. విచారణ సమయంలో కోర్టులో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సీసీ కెమెరాల పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. కోడికత్తి కేసులో ఎయిర్ పోర్టులో 30 కెమెరాలు పనిచేయడం లేదని సీఐఎస్‌ఎఫ్ కోర్టుకు తెలియజేసిందని అన్నారు. సీబీఐ ఆఫీస్‌లో సీసీ కెమెరాలు బిగించాలన్న స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని అభియోగాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. మొత్తం రికార్డులు, ఫైల్ సమర్పించాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సమయంలో రికార్డ్ చేసిన వీడియోలను సోమవారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వీడియో గ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్ చేశారో లేదో ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తెలపాలని పేర్కొంది. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. కాగా... ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్‌పై వాదనలు మొదలవగా... అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన సీబీఐ విచారణకు వెళ్లారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు. రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. జనవరి 28, ఫిబ్రవరి 24వ తారీఖున చేసిన విచారణ స్టేట్‌మెంట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa