ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యతరగతి ప్రజల మందుల కొరకు 90% రాయితీ ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 04:09 PM

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశాలలో గాలేరు-నగిరి సుజల స్రవంతి నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి రాజంపేట మరియు రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో త్రాగు మరియు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మలిశెట్టి జతిన్ ప్రభుత్వాన్ని కోరారు. చిట్వేలి మండలం వెంకట్రాజు పల్లి లో మంగళవారం ఆయన మాట్లాడుతూ పేద మరియు మధ్య తరగతి ప్రజలు ఆరోగ్య నిమిత్తం కొనేటటువంటి అన్ని మందులపైన ప్రభుత్వం 90% రాయితీ ఇవ్వాలని , పేటెంట్ రైట్స్ ఉన్న మందుల పైన కూడా 90% రాయితీ ఈ బడ్జెట్ సమావేశాల నుంచి ఇవ్వాలి అని జతిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మలిశెట్టి రాహుల్, వెంకటయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa