సీఎం వై. ఎస్. జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిల బెట్టుకుని మాట తప్పని మడమ తిప్పని నేతగా చరి త్రలో నిలిచారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని 974 డ్వాక్రా గ్రూపుల్లోని 9, 577 మంది మహిళలకు మూడవ విడత వైఎస్సార్ ఆసరా కింద మంగళవారం గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్ర కల్యాణ మండలంలో రూ. 9, 76, 026 చెక్కును ఆయన అందజేశారు. చంద్రబాబు డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిన చరిత్ర ఆయనకు ఉందన్నారు.
టీడీపీ హయాంలో గుడ్లవల్లేరు మండలంలో రూ. కోటి వరకే స్త్రీ నిధిని పొదుపు సంఘాలకు ఇచ్చారని గుర్తు చేశారు. కాని జగన్ పాలనలో రూ. 5 కోట్ల పైచిలుకు ఇచ్చారన్నారు. బాబు హయాంలో గ్రూపుల నుంచి 13 శాతం వడ్డీని వసూలు చేశారన్నారు. జగన్ పాల నలో కేవలం 7 శాతమే వడ్డీ ఉన్నట్లు తెలిపారు. అనంతరం జగన్ చిత్రపటానికి డ్వాక్రా మహిళలు క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ పాలేటి చంటి, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ పడమటి సుజాత, కొండలమ్మ ఆలయ మాజీ చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, వ్యవ సాయ సలహా కమిటీ డైరెక్టర్ పెన్నేరు ప్రభాకర్, గ్రామ సచివాలయాల మండల కన్వీనర్ కొత్తూరి లక్ష్మీనారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డోకాల కనకరత్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు నాగు, ఎంపీడీఓ వి. దిలీప్ కుమార్, ఏపీఎం సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa