జగనన్న విద్య దీవెన పథకం కింద ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 37, 806 మంది విద్యార్థులకు సంబంధించి 36. 18 కోట్ల రూపాయల నిధులను వసతి దీవెన కింద విద్యార్థులకు చెందిన 34, 206 మంది తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులువిద్యార్థులు ఉన్నత చదువులు చదవాల కోరికను నెరవేర్చాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి జగనన్న వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. జగనన్న విద్య దీవెన పథకం ద్వారా ఐటిఐ, పాలిటె క్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువులుచదివే అర్హులైన పేద విద్యార్థులకు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను క్రమం తప్పకుండ చెల్లిస్తున్నారన్నారు. వసతి దీవెన పథకం ద్వారా ఏడాదికి భోజన వసతి సౌకర్యాలకు 20 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏరాష్ట్రము అమలు చేయలేని సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తూ ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. గత ప్ర భుత్వ హయాంలో ఉన్నత విద్య కేవలం ఉన్నత వర్గాల వారికే లభించేదన్నారు. ఎంతోమంది విద్యార్థులువిద్యార్థులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa