వివేకా హత్య కేసు విచారణలో డ్రామా నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు విషయంలో తాను ఇప్పటికే సీబీఐ జాయింట్ డైరెక్టర్ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని, కేసును లోతుగా విచారణ చేయాలని కోరానని చెప్పారు. వివేకానుని ఎవరు, ఎందుకు చంపారో ప్రజలకు తెలియాలన్నారు. ఇది కుటుంబ హత్యా, రాజకీయ హత్యా అన్న విషయాన్ని సీబీఐ నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తనతో వస్తే కలిసి పోటీ చేస్తామన్నారు. 2014 తర్వాత బయటకు వచ్చిన పవన్ 2019లో మళ్లీ బీజేపీతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు. పవన్ తన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని కోరారు. గంగవరం పోర్టును ఆదానికి అన్యాయంగా అమ్మేశారని ఆరోపించారు. రూ.3లక్షల కోట్ల విలువచేసే ఆస్తిని రూ.3వేల కోట్లకు అమ్మేశారని విమర్శించారు. కాగా, తెలంగాణ సచివాలయాన్ని అంబేడ్కర్ జయంతి రోజు ప్రారంభించాలని తాను కోరితే, హిట్లర్ చనిపోయిన రోజున కేసీఆర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్పై న్యాయపోరాటం కొనసాగుతోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa