ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాటుచేసిన వేదికకు అల్లరి మూక నిప్పంటించిన ఘటన మణిపూర్లో చోటుచేసుకుంది. చురాచందాపూర్ జిల్లాలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ శుక్రవారం పర్యటిస్తున్నారు. జిల్లాలో జిమ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో పర్యటనకు వేదికను ఏర్పాటుచేయగా.. అల్లరి మూక దానికి నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకున్నాయని, భద్రతను పెంచామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీఎం కార్యక్రమానికి వేదికను ఏర్పాటుచేసిన హాల్లో భారీ గుంపు కుర్చీలు పగలగొట్టడం, ఆస్తులను ధ్వంసం చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. క్రీడా సామగ్రిని, ఈవెంట్ జరిగే మైదానానికి కూడా నిప్పు పెట్టారు. కార్యక్రమం రద్దు చేశారా? లేదో? అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. రిజర్వ్డ్, రక్షిత అడవులు, చిత్తడి నేలలకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఈ నిరసనకు నాయకత్వం వహించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్చిలను కూల్చివేస్తోందని గిరిజన సంఘం ఆరోపించింది.
ప్రభుత్వ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయ నిరాకరణలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఫోరమ్కు మద్దతుగా నిలిచింది. ఆదివాసులపై బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిలా ప్రవర్తిస్తోందని అని ఆరోపించింది. ప్రార్థనా స్థలాలను కూల్చివేయడం, గిరిజన గ్రామాలను అక్రమంగా తొలగించడం వంటి గిరిజన హక్కులను నిర్వీర్యం చేయడాన్ని ఖండిస్తున్నామని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేర్కొంది.
అక్రమ నిర్మాణాల పేరుతో ఈ నెల మొదటిలో మూడు చర్చిలను మణిపూర్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కూల్చివేసింది. దీంతో స్థానిక సంస్థ మణిపూర్ హైకోర్టును ఆశ్రయించింది. పత్రాలు, విధాన నిర్ణయాలు, అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్చిల నుంచి ప్రజలను బహిష్కరిస్తున్నట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa