ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు.... ప్రధాని నరేంద్ర మోడీ

national |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 08:00 PM

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు నేపథ్యంలో ఆ పార్టీకి పరువులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేశారు. అలాగే బీజేపీకి మద్దతుగా నిలిచి వారికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు.


కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని, బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నానని, రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తామని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 136, బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa