చిత్తూరులో జూలై 4వ తేదీన నాలుగు గంటలపాటు సీఎం జగన్ పర్యటన సాగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో మెసానికల్ గ్రౌండ్కు అక్కడ్నుంచి గంగినేని చెరువుమీదుగా గిరింపేట వరకు రోడ్షోలో పాల్గొంటారు. 10.55కు విజయా డెయిరీకి చేరుకుని భూమిపూజలో పాల్గొని అమూల్ సంస్థ ప్రతినిధులు, పాడిరైతులతో ముఖాముఖి ఉంటుంది. తర్వాత ప్రశాంతనగర్లో వున్న పోలీసు ట్రైనింగ్ సెంటర్కు 11.10 గంటలకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమూల్ సంస్థతో ఎంవోయూ ఒప్పంద పత్రాల మార్పిడి జరుగుతుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు హెలికాప్టర్లో చీలాపల్లి సీఎంసీ క్యాంప్సను చేరుకుని 300 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 2.05 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన సాగే ప్రాంతాల్లో ఏర్పాట్లను గురువారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa