కేరళ డీజీపీ కడప జిల్లాకు చెందిన దర్వేష్ సాహెబ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన సొంత ఊరు బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల. పట్టణంలోని బెస్తవీధికి చెందిన ఆయన ఆయన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. దర్వేష్ సాహెబ్ ప్రాథమిక విద్య పోరుమామిళ్లలో పూర్తి చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రైవేటు పాఠశాల, ఆరు నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ జూనియర్ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీ తిరుపతిలో పూర్తి చేశారు. ఆయన డీజీపీగా నియమితులు కావడంతో ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు
దర్వేష్ సాహెబ్ ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యారు. ఆయన మొదటిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఎంపికయ్యారు. ఆ పోస్టును వదులుకొని మరోసారి ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యారు.. ఈసారి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. 1990 బ్యాచ్ కేరళ కేడర్లో ఉద్యోగంలో చేరారు.. అంచలంచెలుగా ఎదిగి జిల్లా ఎస్పీ నుంచి డీఐజీ, ఐజీగా పదవులు పొంది ఇప్పుడు డీజీపీగా నియమితులయ్యారు. ఆయన వచ్చే ఏడాది జులై వరకు పదవిలో కొనసాగనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa