హైదరాబాద్లో చదువుతున్న ఐఐటీ విద్యార్థిపై విశాఖలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా ర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దనావత్ కార్తిక్ నాయక్ హైదరాబాద్ ఐఐటీలో చదువుతున్నాడు. పోలీసులు ప్రాథమికంగా చెబుతున్న సమాచారం మేవరకు.. అతడు ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. కార్తీక్ ఈ నెల 17న కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి విశాఖ వెళ్లాడు.
కార్తీక్ కనిపించకపోవడంతో వెంటనే తల్లి దండ్రులకి సమాచారం అందించారు. ఆ వెంటనే సంగారెడ్డి జిల్లా రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే.. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆరా తీశారు. అతడు విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్నట్లు సిగ్నల్స్ ద్వారా తెలంగాణ పోలీసులు గుర్తించారు. మూడు రోజుల నుంచి బీచ్ రోడ్డు మొత్తం గాలించినా లాభం లేకుండా పోయింది.
కార్తీక్ అక్కడే ఓ బేకరీలో ఫోన్ పే చేసి బన్ కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అతడు ఎప్పుడు ఫోన్ అన్ చేసినా సిగ్నల్స్ ట్రేస్ చేసే లోపు అక్కడ నుంచి మాయమవుతున్నట్లు చెబుతున్నారు. కుమారుడు ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. అందుకే విద్యార్థి ఆచూకీ కోసం ఏకంగా లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు.
రూ.20వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సచివాలయ వార్డ్ అడ్మినిస్టేటివ్
ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. కార్తీక్ రెండు రోజులగా ఫోన్ చేసినా తీయకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చిందట. వెంటనే ఐఐటి హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేస్తే.. రూమ్కి వెళ్లి చూస్తే కనిపించలేదట. తోటి విద్యార్థులను అడిగి ఆరా తీస్తే.. ఐఐటీకి దగ్గరలో ఉన్న దాబాలో ఉన్నట్లు వారితో చెప్పినట్లు వివరించారట. రూ.20 డబ్బులు కావాలని అడిగినట్లు ఓ రూమ్మేట్ చెప్పారట. అక్కడకు వెళ్లి చూస్తే కనిపించలేదని చెబుతున్నారు.
తల్లిడండ్రులు 19న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తీక్ పగటి పూట అప్పుడప్పుడు మొబైల్ ఆన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తన తండ్రి బ్యాంక్ అకౌంట్స్ను నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఏదైనా కావాల్సిన తిండి పదార్థాలు కొనుక్కుని బిల్ కట్టి వెంటనే ఫోన్ ఆపేసేస్తున్నట్లు గుర్తించారట. వెంటనే అక్కడికి వెళితే కనిపించకుండా మాయం అవుతున్నాడట.. అతడి కోసం గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద కార్తీక్ తల్లిదండ్రులతో పాటుగా పోలీసుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నాడు. మొత్తం మీద కార్తీక్ మిస్సింగ్ మిస్టరీగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa