ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కౌలు రైతులకు ఆగస్టు 17 నాటికి కార్డులు జారీ,,,,సెప్టెంబర్ 15 నాటికి ఈ క్రాప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 08:36 PM

ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆగస్టు 17 నాటికి కౌలు రైతులకు పంటసాగుదారు హక్కు కార్డుల జారీ, పరిశీలన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 15 నాటికి ఈ క్రాప్‌ పూర్తి చేయాలని.. అలాగే యంత్రసేవ యాప్‌లో బుకింగ్‌ వివరాలతో పాటు సీహెచ్‌సీ సంఘాలు తీసుకున్న రుణ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు


మరోవైపు గోదావరి వరత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్.. గోదావరి వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరులోపే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న పంటలకు నష్టాన్ని అందజేస్తామని.. వర్షాలు పడిన సమయంలో వరదలు ముంచెత్తిన కారణంగా రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారన్నారు. వరదలతో దెబ్బతిన్న పంటలకు నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి.. ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. ఆ తర్వాత వివరాలను ఆర్బీకేల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. పేర్లు లేనివారు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని.. అన్నీ పూర్తి చేసి ఈ నెలాఖరులోపే పరిహారాన్ని అందిస్తామని హమీ ఇచ్చారు ముఖ్మయంత్రి.


భూమి కోతకు గురవకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని.. మూడున్నర కిలోమీటర్ల మేర రక్షణగోడ నిర్మిస్తామన్నారు. మరో రెండు నెలల్లోనే ఆ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మొదటి రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్టలో పర్యటించిన జగన్.. పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రెండవ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.


ముఖ్యమంత్రి లంక గ్రామాలను పరిశీలించారు.. కూనలంకలో వరద బాధితులను పరామర్శించారు. వరద ప్రారంభమైనప్పటి నుంచే ముందు జాగ్రత్తలు తీసుకున్నామన్నామని.. అన్ని జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేశామన్నారు. గ్రామ సచివాలయ సిబ్బందిని సైతం వరద ప్రాంతాల్లో మోహరించి.. సహాయ చర్యలు అందించామన్నారు. వరదల సమయంలో నిత్యావసరాలు, మంచినీటి సమస్యలు తలెత్తకుండా చూశామన్నారు. పశువులకు సైతం ఇబ్బంది తలెత్తకుండా చూసిన ప్రభుత్వం తమదన్నారు. ప్రతి ఒక్కరికి సాయం అందేలా చూశామన్నారు.. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచారని ప్రశంసించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa