ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొమ్ముకాస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 02:25 PM

ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లిమండలం వెంకటగారిపల్లిలో ఓ సచివాలయ భవనానికి సంబంధించిన వివాదంలో బుధవారం రాత్రి వైసీపీ, టీడీపీ నాయకులుమధ్య వాగ్వాదం జరిగింది.  ఈ సందర్భంగా శ్రీరామ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో రెండువర్గాలు గొడవపడుతుంటే ఆపాల్సిన పోలీసులే.. వైసీపీ నాయకులు దాడులు చేసేలా ప్రోత్సహించారని ఆరోపించారు. అడ్డువచ్చిన మహిళలపై కూడా దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలా గ్రామాల్లోకి వెళ్లి పోలీసులే దాడులు చేయిస్తూ ఘర్షణలు ప్రేరేపిస్తుంటే వారిని ఏమనాలని ప్రశ్నించారు. దాడులు చేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని శ్రీరామ్‌ హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa