ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2023, 05:52 PM

గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేశారు. అరండల్ పేటలో మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి గిరి బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు సంఘటన ప్రదేశానికి చేరుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లా చెదురు చేశారు. పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదానికి దిగిన జనసేన నేతలను అరెస్టు చేశారు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్ పరిస్థితిని సమీక్షించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa