ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాదయత్రని అడ్డుకోవడానికే నాపైన కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 04:56 PM

 అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో 14వ నిందితుడిగా సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  స్పందించారు. యువ‌గ‌ళం పేరు వింటే సైకో జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నారన్నారు. ‘‘నా పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో 1 తెచ్చినా, ఆగ‌ని యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించింది. ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నా జ‌న‌జైత్రయాత్ర‌గా ముందుకు సాగింది. మ‌ళ్లీ యువ‌గ‌ళం ఆరంభిస్తామ‌నే స‌రికి, నా శాఖ‌కి సంబంధంలేని, అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో న‌న్ను ఏ14గా చేర్పించారీ 420 సీఎం’’ అంటూ దుయ్యబట్టారు. రిపేర్ల పేరుతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం బ్రిడ్జి మూసేయించారన్నారు. ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టి, అక్ర‌మ అరెస్టులు చేసినా యువ‌గ‌ళం ఆగ‌దని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా జ‌న‌చైత‌న్య‌మే యువ‌గ‌ళాన్ని వినిపిస్తుందని.. ఇచ్ఛాపురం వ‌ర‌కూ న‌డిపిస్తుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa