ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనతో కలసి ముందుకెళ్థాం..... ఆ పార్టీతో సమన్వయం కోసం నేడు టీడీపీ కమిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 09:24 PM

ఏపీలో వైసీపీ సర్కార్ పై పోరాటానికి టీడీపీ, జనసేన పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇదిలావుంటే ఇటీవల చంద్రబాబు అరెస్ట్ కాగా, జైలులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పొత్తు దిశగా టీడీపీ ముందడుగు వేసింది. జనసేనతో సమన్వయం కోసం నేడు టీడీపీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని నియమించినట్టు వెల్లడించారు. ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.


కమిటీలోని సభ్యులు...


1. కింజరాపు అచ్చెన్నాయుడు


2. యనమల రామకృష్ణుడు


3. పయ్యావుల కేశవ్


4. పితాని సత్యనారాయణ 


5. తంగిరాల సౌమ్య






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa