ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీమహాలక్ష్మి రూపంలో దర్శనమీయనున్న అమ్మవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 10:12 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా  నాలుగో రోజు శ్రీమహాలక్ష్మి దేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అలంకారంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అష్టలక్ష్మిల్లో ఒకరైన మహాలక్ష్మిని దర్శనం చేసుకునేందుకు భక్తులు మిక్కిలిగా ఇష్టపడతారు. ఇంద్రకీలాద్రిపై శోభాయమానంగా జరుగుతున్న శరన్నవరాత్రులలో దుర్గాదేవికి చేసే మహాలక్ష్మి అలంకారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమ్మవారు మహాలక్ష్మీ, మహా సరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. మూడు శక్తుల్లో ఒక శక్తైన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసున్ని సంహరించింది. లోక స్థితి కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన , గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa