గురువారం అనగా నిన్న కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ఏపీ వాసులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాగేపల్లి, చిక్కబళ్లాపూర్ మార్గంలో 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. దసరా పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లే కూలీలుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే కర్ణాటక పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రహదారిపై పొగమంచే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీని డ్రైవర్ గుర్తించకపోవడంతో ఇంతటి ఘోరం జరిగింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా... ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఓడిస్సాకు చెందిన భార్యాభర్తలు వెంకటనారాయణ, సుబ్బమ్మ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa