ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 24న తిరుమల శ్రీవారి స్పెషల్ ఎంట్రీ టికెట్స్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 11:11 PM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన 3 వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. దర్శన టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. టికెట్లు కావాలనుకునే భక్తులు టీటీడీకి సంబంధించిన https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గ‌దుల‌ను బుకింగ్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


మరోవైపు.. తిరుమలలో 2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినం జరగనుండగా.. ఆ వేడుకకు సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసున్న వారు ఈ స్లాట్లను బుక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలో భక్తులు స్వచ్ఛంద సేవ చేసేందుకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను కూడా టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవ‌ల స్లాట్లను www.tirumala.org వెబ్‌సైట్‌లో భ‌క్తులు బుక్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa