ఉత్తరాదిని చలి భయపెడుతోంది. చలి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం వేళ పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా సూర్యోదయం ఆలస్యం కావడంతో ఉదయం వేళ ప్రజలు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భీకరమైన చలి కొరికేస్తుండటంతో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
పంజాబ్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 8 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు వారం రోజుల పాటు సెలవులు ఇస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. నర్సరీ నుంచి 10 వ తరగతి వరకు అన్ని పాఠశాలలు మూసి ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పంజాబ్లో ఆదివారం కూడా చల్లటి వాతావరణం నెలకొంది. ఉదయం పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అమృత్సర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. లూథియానా, పటియాలా, పఠాన్కోట్, బటిండా, ఫరీద్కోట్, గురుదాస్పూర్లలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa