అందరి వద్ద నుంచి జగన్ కు తీసుకోవడమే తెలుసని, ఇవ్వడం తెలియదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. తాను జగన్ కు సహాయం చేశానని, కానీ జగన్ నుంచి తానెప్పుడూ సహాయం పొందలేదని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసినవారే నిజమైన స్నేహితులు అని, ఇవాళ సంక్రాంతి వేడుకల్లో సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ తన గురించి మరోసారి ప్రస్తావించారని రఘురామ వెల్లడించారు.
"వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ భూములు అమ్మాలని భావించారు. ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. ఆ తర్వాత ఇసుక రేట్లు పెంచాలని నిర్ణయించారు. దాన్ని కూడా నేను వ్యతిరేకించాను. దాంతో నాపై కేసులు పెట్టారు. రాజద్రోహం అంటూ అక్రమ కేసు పెట్టారు. నా నియోజవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో నేను రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యాను. అందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయం అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన కూటమి 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఒకవేళ షర్మిల గనుక ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే టీడీపీ-జనసేన కూటమి మరో 20 స్థానాలు అదనంగా గెలుచుకుంటుందని వివరించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa