ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టిపర్తిలో కొనసాగుతున్న భువనేశ్వరి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 03:35 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలివాలి’’ పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థికి సాయం అందిస్తున్నారు. ఈరోజు (మంగళవారం) పుట్టిపర్తి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి రూరల్ మండలం నిడుమామిడి గ్రామంలో కార్యకర్త మునిమడుగు బావయ్య కుటుంబాన్ని పరమార్శించారు. గత ఏడాది అక్టోబర్‌లో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక బావయ్య గుండెపోటుతో మృతిచెందాడు. ఈ క్రమంలో బావయ్య చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు అర్పించారు.  బావయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బావయ్య కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చెక్కు ఇచ్చి భువనేశ్వరి ఆర్థికసాయం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa