ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగబాబుతో సమావేశం కానున్న తిరుపతి జనసేన నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 05:36 PM

చిత్తూరు  జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు  అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును తిరుపతి టీడీపీ నేతలు అంగీకరించని పరిస్థితి. జనసేనలోనూ పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గెలవాల్సిన తిరుపతి సీటును పోగొట్టుకోకూడదని జనసేన, టీడీపీ అదిష్టానం సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేడు మంగళగిరి జనసేన ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఆ పార్టీ నేత నాగబాబుతో తిరుపతి జనసేన నేతలు సమావేశం కానున్నారు. తిరుపతి సీటును టీడీపీకి ఇచ్చి, చిత్తూరు గాని, మదనపల్లి గాని జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాని పక్షంలో టీడీపీలోని తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa