ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుకి దళితులంటే ఎందుకు అంత అసూయా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 12:33 PM

దళితులు వేలిముద్రగాళ్లని, డ్రైవర్లు అని ఎగతాళి చేసిన బాబుకు రాజకీయ సమాధికడతామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు నందిగం సురేష్ హెచ్చ‌రించారు. తాడేపల్లిలోని వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.... రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవమున్న నాయకుడిగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ఎస్సీల పట్ల తనకున్న భావాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మీటింగ్‌లో ఒక ఎస్సీ నాయకుడి గురించి ఏం మాట్లాడారో అందరం చూశాం. అదే విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను.(శింగనమల వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గురించి చంద్రబాబు ఏమన్నారో.. ఆయన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపారు) ఎస్సీలను ఉద్దేశించి ఇదే చంద్రబాబు గతంలో ఏమన్నారు...? ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారంటూ ఎస్సీలను తీవ్రంగా అవమానించా డు. ఇవాళేమో.. ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లు టిప్పర్‌ డ్రైవర్‌లంటూ ఎస్సీ నాయకుడి గురించి ఎగతాళిగా మాట్లాడాడు. చంద్రబాబు అనే వ్యక్తి నీచ సంస్కృతి కలిగిన వాడనేందుకు ఇంతకన్నా వేరే నిదర్శనమేదీ లేదు. ఏంటి .. ఆయన అహంకారం..? ఎస్సీలు రాజకీయ నాయకులుగా ఎదగకూడదని ఆయన భావించడం చాలా బాధాకరం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa