ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ అని.. సీఎం జగన్ సిద్ధమా? ! అని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మంగళగిరిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అడ్డగోలుగా అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని అన్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే పెట్టుబడులు వస్తాయన్నారు... జగన్ మళ్లీ వస్తే దాడులు తప్పవని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లలో రూ.10 వేసి వంద లాగేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని నారా లోకేష్ విమర్శించారు. ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేము రెడీ అని.,. జగన్ సిద్ధమా? అంటూ లోకేష్ మరోసారి సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa