ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చుక్కలు భూముల ఆర్డినెన్స్‌ వెనక్కి పంపిన గ‌వ‌ర్న‌ర్‌?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 12:45 AM

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చుక్కల భూముల విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. ఆ భూములపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై వివరణ కోరుతూ నరసింహన్ వెనక్కి పంపారు. చుక్కల భూముల దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం 2 నెలలు పెట్టడంపై గవర్నర్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఆమోదం కోసం తన వద్దకు వచ్చిన మరో ఆర్డినెన్సుకు గవర్నర్ పచ్చజెండా ఊపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని 20 ఏళ్ల వరకు ఎవరికీ అమ్ముకోకుండా ఉండే నిబంధన ఇందులో ఉంది. చుక్కల భూములపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్‌కు అవసరం లేదని గవర్నర్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ ఫైలు అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌కు ముందు వచ్చిందని, చుక్కల భూముల ఫైలు తర్వాత వచ్చిందని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. దీంతో చుక్కల భూముల బిల్లును గవర్నర్‌ ఆమోదంతో సంబంధం లేకుండా నేరుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని బాబు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ వ్యహారంలో రెవెన్యూ శాఖ విఫలమైంది బాబు మండిపడుతున్నారు. రెవిన్యూ రికార్డుల్లో ఉండి, యజమానులు ఎవరో తెలియని భూములను చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. వాటిని గుర్తించడానికి చుక్క పెట్టేవారు కనుక ఆ పేరొచ్చింది. ఈ భూముల్లో కొన్ని చోట్లు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం వీటి రికార్డులు పరిశీలించి, తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి యత్నిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa