టీడీపీ ప్రతి పక్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పార్టీ కార్య క్రమాలు నిర్వహించి కష్టపడిన వారికే ప్రస్తుత ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చి గుర్తిస్తుందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె దేవతానగర్లోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు జగనమోహనరాజును కలిశారు. తాము ఐదేళ్లుగా అష్టకష్టాలు పడ్డామని, తమపై అక్రమ కేసులు బనాయించారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగనమోహనరాజు మాట్లాడుతూ ఐదేళ్లుగా కార్యకర్త లు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు అధిష్టానం వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగానే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో నామినేటెడ్ పదవులను అధిష్టానం ఇస్తుందన్నారు. ఏ కార్యకర్త, నాయకుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ నిర్ధిష్ట ప్రణాళికతో అందరికి న్యాయం చేస్తారని భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్చినబాబు, దొరస్వామి నాయుడు, దేవరింటి శ్రీనివాసులు, టీఎనటీయూసీ కొండ్రెడ్డి, దేవారమేశ, ఆర్జే వెంకటేశ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa