ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొమ్ముకోసం సొంత చెల్లిని హతమార్చిన దుర్మార్గపు అన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:48 PM

బీమా సంస్థల నుంచి క్లైం పొందేందుకు సొంత చెల్లెలను హత్యచేసిన ఘటన గతేడాది ఫిబ్రవరి 24న కాటూరివారిపాలెం సమీపంలో చోటుచేసుకొంది. రూ.1.13 కోట్ల పరిహారం కోసం ఈ ఘాతుకానికి సొంత అన్నే పాల్పడ్డారు. అప్పట్లో రోడ్డుప్రమాదంగా కేసు నమోదైంది. ఆ కేసు సంబంధించి వివరాలను సీఐ వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్‌రెడ్డి, సంధ్య(25)లు అన్నాచెల్లెల్లు. సంధ్య కొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో అశోక్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ చేస్తూ, అప్పులపాలయ్యాడు. అయితే తన సోదరి సంధ్య పేరుతో రూ.1.13 కోట్లు బీమా చేయించాడు. ఆ బీమా సొమ్ము క్లైం చేసుకొంటే తన అప్పుల నుంచి బయటపడవచ్చని పథకం రచించాడు. సంధ్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత ఏడాది ఫిబ్రవరి 4న ఒంగోలు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తిరిగి స్వగ్రామం కనిగిరి మండలం పునుగోడు వస్తున్నారు. ఈ క్రమంలో చెల్లెలికి హాస్పిటల్‌లో ఇచ్చిన మాత్రలు కాకుండా మత్తుమాత్రలు ఇచ్చాడు. ఆమె నిద్రలోకి చేరుకున్న తరువాత అశోక్‌రెడ్డి కాటూరివారిపాలెం సమీపంలో కారు ఆపి కారులో ఉన్న దిండుతో ఆమెకు ఊపిరి ఆడకుండా చేసి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం కాటూరివారిపాలెం సమీపంలో కారుతో ఓ చెట్టును ఢీకొట్టాడు. ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకించారించాడు. ప్రమాదంలో సంధ్య మృతిచెందినట్లు అశోక్‌రెడ్డి కథ అల్లాడు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు మాలకొండారెడ్డికి ఈ విషయం చెప్పి సాయం కోరాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పూర్తి విషయాలు తెలుస్తాయని సంధ్యను నువ్వే హత్య చేసినట్లు రిపోర్ట్‌ వస్తుందని స్నేహితుడు మాలకొండారెడ్డి చెప్పాడు. దీంతో దొరికిపోతాననే భయంతో మాలకొండారెడ్డి సహాయంతో ఆసుపత్రిలో తోటిగా విధులు నిర్వహిస్తున్న యూస్‌ఫతో మాట్లాడి శవపరీక్షలో సీజ్‌ చేసిన అవయవాలను మార్పు చేసేందుకు రూ.3.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అందులో రూ.3 లక్షలు యూస్‌ఫకు ఇచ్చారు. అనుకున్న ప్రకారం సంధ్య అవయవాలను మరోకవ్యక్తికి మార్చి రిపోర్ట్‌ కోసం పంపారు. అయితే వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఉప్పందించారు. పోలీసులు అప్పటినుంచి అనుమానంతో అశోక్‌రెడ్డిపై నిఘాపెట్టారు. వారి విచారణలో అశోక్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా హత్యచేసినట్లు తేలడంతో అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సహకరించిన మాలకొండారెడ్డి, యూస్‌ఫల కోసం గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa