ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాలలో రైతులు ప్రభుత్వాలకి సహకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 11:23 AM

 ప్రస్తుత ఇంజనీర్లు తమలాగా మట్టిలో పుట్టి, మట్టినుంచి రాలేదని, సంపన్న కుటుంబాల నుంచి వచ్చారని, అందుకే రిస్క్‌ చేసేందుకు ముందుకు రారని రాష్ట్ర సాగునీటి విభాగం సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. అనంతపురం నగరంలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కాలేజీ 17వ వార్షికోత్సవంలో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఫౌండర్‌ డైరెక్టర్‌, విశ్రాంత ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ, అనంతపురం జేఎన్టీయూ రిజిస్ర్టార్‌ కృష్ణయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే అన్ని పనులు చేయలేరని, గ్రామాలలో రైతులు సంఘటితమై, ప్రభుత్వం ఇచ్చే నిధులతో కాలువలను బాగుచేసుకోవాలని కన్నయ్యనాయుడు సూచించారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యనందించాలని లక్ష్మీనారాయణ సూచించారు. విద్యకు ఎంత ఖర్చు పెడుతున్నామన్నది ముఖ్యం కాదని, ఏ విధంగా ఖర్చుచేస్తున్నామనేది ముఖ్యమని అన్నారు. గురువులను గౌరవించడం, ప్రజాస్వామ్య నిర్మాణంపై తరగతి గదిలో చర్చించాలని కోరారు. విద్యలో రాశి కాదని, వాసి కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. విద్యార్థులకు డిగ్రీ ఇచ్చి పంపడం కాదని, నైపుణ్యం పెంచి పంపాలని.. లేకుంటే ద్రోహం చేసినవారవుతారని స్పష్టంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa