ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిరాయింపులకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 12:56 PM

రాష్ట్రంలో వైస్రాయ్ హోట‌ల్ రాజ‌కీయాలే నేటికీ న‌డుస్తున్నాయి అని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ విప్ తైనాల విజ‌య్ కుమార్‌ అన్నారు. అయన మాట్లాడుతూ... విశాఖ ప్ర‌జలంతా  తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉంటే 10 నెల‌ల మేయ‌ర్ పీఠం కోసం దిగ‌జారి రాజ‌కీయాలు చేశారు. నాలుగేళ్లుగా మేయ‌ర్‌గా నిజాయితీతో ప‌నిచేస్తున్న బీసీ మ‌హిళ‌ను దించ‌డం దారుణం. వైయస్ఆర్‌సీపీ  నుంచి గెలిచిన కార్పొరేట‌ర్లంద‌రికీ విప్ జారీ చేశాం. 27 మంది విప్‌ను ధిక్క‌రించారు. వారిపై ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. ఏడు రోజుల్లో వారిని డిస్‌క్వాలిఫై చేయాల‌ని లేఖ‌లో కోరాం. అధికారులు ప‌ట్టించుకోక‌పోతే న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తాం అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa