ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నంలో ఉన్న కరాచీ బేకరిపై దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 07:07 PM

పహల్గాం ఉగ్రదాడి భారతీయులను తీవ్రంగా కలచి వేసింది. ఈ ఘటనలో సుమారు 26 మంది పర్యాటకులు చనిపోయారు. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రపంచ దేశాలు సైతం ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఇక ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇరు దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థుతులు నెలకొని ఉన్నాయి. పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థానీయులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో విశాఖపట్నంలోని కరాచీ బేకరిపై దాడి చేశారు. ఎందుకంటే..


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని కరాచీ నగరం పేరుతో ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో ఉన్న కరాచీ బేకరి పేరును మార్చాలని హిందూ జన జాగరణ సమితీ డిమాండ్ చేసింది. అంతేకాక ఈ గ్రూపుకు చెందిన కొందరు కార్యకర్తలు కరాచీ బేకరి వద్ద ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. వాటిలో కరాచీ పేరు తొలగించి భారత్‌ను గౌరవించాలనే నినాదాలు ఉన్నాయి. జాతీయ జెండాలతో జాగరణ సమితి కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. దాంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఇప్పటివరకూ భారత్-పాక్ మధ్య ఎన్ని విభేదాలున్నా, ఎంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా సరే.. కరాచీ బేకరి పేరు మార్చాలనే డిమాండ్ మాత్రం ఎక్కడా వినిపించలేదు. కానీ ప్రస్తుతం పహల్గాం దాడి తర్వాత పరిస్థితి మారింది. కరాచీ బేకరి పేరుపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టడం సంచలనంగా మారింది. అయితే నిరసన శాంతియుతంగానే సాగడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


మరోవైపు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై పరిమితంగా అయినా సరే దాడి చేసేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతోనూ సమావేశమయ్యారు. అలానే కార్యదర్శితోనూ భేటీ అయ్యారు. పాకిస్తాన్ పై యుద్దసన్నద్దతను వారితో చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa