ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం తాజాగా దాడులు నిర్వహించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత్–పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ పరిస్థితిని గమనించిన బ్రిటన్ స్పందన తెలియజేసింది. చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో, భారత్, పాకిస్తాన్ల మధ్య సంభాషణకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని బ్రిటన్ అధికార ప్రతినిధులు వెల్లడించారు. వాదనలు, ఘర్షణలకు బదులుగా, సమస్యల పరిష్కారం కోసం కూర్చుని మాట్లాడుకోవడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి భారత్, పాకిస్థాన్ మధ్య ఆరోగ్యకర సంబంధాలు కీలకమని బ్రిటన్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ సమాజం కూడా ఈ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతియుత పరిష్కార మార్గాలను అన్వేషించాలని పిలుపునిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa