ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 04:57 PM

ఆపరేషన్ సిందూర్ భారతదేశాన్ని సగౌరవంగా తలెత్తుకునేలా చేసిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. పహేల్గాం ముష్కరుల దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. ఉగ్రవాదం అంతమయ్యేంతవరకు ఇది కొనసాగుతుందని తెలిపారు. పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని.. ఉగ్రవాదులకు స్థావరాలను కల్పించడం మానేయాలని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నడుస్తున్న అద్భుతమైన పాలన మాటలతో కాదు చేతలతో సమాధానం చెబుతారని మరోసారి నిరూపితమైందని అన్నారు. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాదులను తెల్లవారుజామున మట్టుబెట్టిన భారతసైన్యానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa