ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదులకు ముందుంది ముసళ్ల పండగ అంటున్న మాజీ చీఫ్ జనరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 05:07 PM

భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఉద్దేశిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే, "సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది" అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa