నేడు జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో సుమారు 25 నుంచి 30 అంశాలు అజెండాగా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇవాళ(మే8) ఏపీ కేబినెట్ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణ చేసేందుకు కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపే అవకాశం ఉంది. మత్స్యకారులకు చేపలవేట నిషేధ సమయంలో ఇచ్చే రూ. 10 వేలను రూ. 20 వేలకు పెంచుతూ మంత్రిమండలి ఆమోదించనుంది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖ ద్వారా 281 పనులను హైబ్రిడ్ యాన్యువల్ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. లేబర్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 2019లో గత జగన్ ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న మూడు బిల్లులను వెనక్కి తీసుకునేందుకు మంత్రి మండలి ఆమోదించనుంది. ఇండస్ట్రీయల్ సవరణ బిల్లు 2019, లేబర్ లాస్ బిల్లు 2019, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2019పై కేబినెట్లో చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa