ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన రైస్‌ కార్డులకి దరఖాస్తులు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 04:27 PM

రేషన్‌ కార్డుల (రైస్‌ కార్డు) కోసం ఎదురుచూస్తున్న పేదలకు కొత్తవి ఇచ్చేందుకు బుధవారం నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏడాది న్నర నుంచి కొత్త కార్డులతోపాటు ప్రస్తుతం ఉన్న వాటిలో చేర్పులు, మార్పుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్‌ కార్డుల జారీకి అర్హులైన పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించారు. బుధవారం నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయాల్లో రైస్‌ కార్డులకు సంబంధించి ఏడు రకాల సర్వీసులను ప్రారంభించారు. కొత్త బియ్యం కార్డు, సభ్యుల చేరిక, కార్డును విభజించడం, ఉన్న సభ్యుల తొలగింపు, కార్డును అప్పగించడం, చిరునామా మార్పులు, తప్పు ఆధార్‌ సీడింగ్‌ను సరిదిద్దడం వంటి సేవలను ప్రారంభించారు. సచివాలయాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో రైస్‌కార్డులు, చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa