ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్-400 ధ్వంసం అంటూ పాక్ చేసిన ఆరోపణలను ఖండించిన ప్రధాని

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 05:20 PM

భారత వాయు రక్షణ వ్యవస్థ ఎస్-400ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు. మంగళవారం నాడు పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన, అక్కడ మోహరించి ఉన్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఈ చర్య ద్వారా, పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు.భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' అనంతరం, పాకిస్థాన్ వైమానిక దళం  తమ హైపర్‌సోనిక్ క్షిపణులతో అదంపూర్‌లోని ఎస్-400 వ్యవస్థను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నకిలీ వీడియోలను కూడా ప్రచారంలో పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి, అక్కడి వాయుసేన యోధులతో ముచ్చటించారు. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో చురుగ్గా వ్యవహరించిన ఈ వైమానిక స్థావరంపై గత వారం పాకిస్థాన్ దాడికి యత్నించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.ప్రధాని పర్యటనకు ముందే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేసింది. ఎస్-400 వ్యవస్థకు, బ్రహ్మోస్ క్షిపణి స్థావరానికి నష్టం కలిగించామన్న పాక్ వాదనలను తీవ్రంగా ఖండించింది. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, "పాకిస్థాన్ తమ జేఎఫ్-17 విమానాలతో మా ఎస్-400, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను దెబ్బతీశామని చెప్పడం పూర్తిగా అవాస్తవం. అలాగే, సిర్సా, జమ్మూ, పఠాన్‌కోట్, భటిండా, నలియా, భుజ్ వంటి మన వైమానిక క్షేత్రాలు దెబ్బతిన్నాయని కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి" అని స్పష్టం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa