ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిక్కర్ స్కామ్ లో అసలు దొంగని బయటకి లాగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 06:08 PM

లిక్కర్ స్కామ్ కేసుపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్ వెనకున్న బిగ్ బాస్ ను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే శక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవ్వాలని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను తాజాగా అరెస్ట్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa