ప్రజల పక్షాన నిలబడటమే అసలైన రాజకీయ ధ్యేయంగా భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో వున్నా లేకున్నా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం రాయచోటిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ, గ్రామ స్థాయిలో పార్టీ శక్తిని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
శ్రేణుల మధ్య సంప్రదింపులు, పారదర్శకత, మరియు క్రమశిక్షణతో పార్టీ పనిచేస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కూడా కీలక భూమిక పోషించాలన్నారు.
ఈ సమావేశంలో పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీని బలపరిచే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa