తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. చింతల చేనులో పార్కింగ్లో ఉంచిన ఎలక్ట్రిక్ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే బస్సు కనపడకపోవడంతో సంబంధిత డ్రైవర్ బస్సు మేనేజర్కు సమాచారం అందించారు. ఎలక్ట్రిక్ బస్సు ఎంత వెతికినా కనిపించడంతో చివరికి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు బస్సును చివరికి కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఘాట్ రోడ్డులో ఉన్నట్లు గుర్తించారు.కడప - రాయచోటి ప్రధాన రహదారిలోని ఘాట్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్డు లోని మలుపును తిప్పలేక చోరుడు ప్రమాదానికి గురై బస్సును అక్కడే వదిలి వెళ్ళినట్లు తెలుస్తోంది. కడప జిల్లా, చింతకొమ్మదిన్నె పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, చింతల చేనులో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సు విలువ రూ. కోటి 30 లక్షలు అని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa