సిక్కోలు మేజర్కు అపూర్వ గౌరవం దక్కింది. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్ మళ్ల రామ్గోపాలనాయుడుకు దేశ రక్షణ చరిత్రలోనే రెండో అత్యుత్తమ పురస్కారమైన ‘కీర్తి చక్ర అవార్డు’ లభించింది. గురువారం రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. 2023లో ఉగ్రవాదులతో విరోచితంగా చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ.. ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లో పనిచేస్తున్న రామ్గోపాలనాయుడు కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మోహరించిన పెట్రోలింగ్ బృందానికి లీడర్గా వ్యవహరించారు. 2023 అక్టోబర్26న ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారని సమాచారం అందిన వెంటనే రామ్గోపాలనాయుడు రంగంలోకి దిగారు. జవాన్లకు మార ్గనిర్దేశం చేస్తూ.. ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు చేయడంతో తన దళాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఒక ఉగ్రవాదిని హతమర్చారు. దాడిని దైర్యంగా ఎదుర్కొని తన సైనికులను కాపాడుకుంటూ.. ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ధైర్యసాహసాలను మెచ్చి.. కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa