ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏమి చేసారో చెప్పగలరా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 01:27 PM

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపులోని స్థితిలో ఉంటే, అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. ఏడాది పాలనలో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనిని అయినా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ అంటూ ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ, నేడు ఆరు సూత్రాలు అంటూ కొత్త పాట ప్రారంభించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా తమ ఘనతగా చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం సిగ్గుచేటు. ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్నది మహానాడు కాదు దగానాడు. ప్రజలను అనేక హామీలతో నమ్మించి, మోసం చేశారు. తమను తాము పొగుడుకోవడం, గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మహానాడు అనే దగానాడును జరుపుకుంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa