ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు చేయడం అనివార్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం గుత్తి పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన గుత్తి కోట గుర్రపుశాలలో యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. అధికారులు స్వయంగా యోగాసనాలు వేస్తూ, ప్రజలకు ప్రేరణగా నిలిచారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, "ఆరోగ్యమైన సమాజం కోసం ప్రతినిత్యం యోగా చేయడం అవసరం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ యోగాసనాలపై దృష్టి పెట్టాలి," అని అన్నారు. అలాగే, పర్యాటకాభివృద్ధికి గుత్తికోట ఉత్సవాలు ఎంతో దోహదపడతాయనీ, 2026 జనవరిలో జరగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమం యోగాను ప్రోత్సహించడంలో భాగంగా ఎంతో విజయవంతంగా కొనసాగింది. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై, యోగాసనాల్లో పాల్గొనడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa