ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 05:50 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న విద్యార్ధులకు ఇంటర్‌ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది.ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం (జూన్‌ 7) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ను నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు సబ్జెక్టుల్లో తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్ధులు కూడా రాశారు. ఇక పరీక్షలు పూర్తయి దాదాపు నెల రోజులు గడుస్తున్నందున వేలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ల నిరీక్షణకు శనివారం తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. ఇక ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు చాలా మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షతోపాటు ఈఏపీసెట్‌, నీట్‌ వంటి పరీక్షలు కూడా రాశారు. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదలైంది. ఇక నీట్ ఫలితాల విడుదల తేదీ కూడా వెల్లడైంది. ఇంటర్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు విడదుల చేస్తే విద్యార్ధులు ఆయా ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa